డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. డబ్బు చుట్టూనే లోకం తిరుగుతున్నది. ఎన్ని మాటలు చెప్పినా.. డబ్బు లేకుంటే మాత్రం పక్కన పెట్టేస్తారు. ఎలా సంపాదించావు అన్నది ఇప్పుడు ఎవరూ చూడటం లేదు. ఎంత సంపాదించారు అన్నదే ప్రధానం. అందుకోసమే ఎలాంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు.
చేతిలో డబ్బులు ఉంటె ఆ ధైర్యమే వేరు. అందుకే సేవింగ్స్ కోసం జనం ప్రయత్నిస్తుంటారు. రిస్క్ తీసుకోవడానికి పెద్దగా సాహసం చేయరు. సెలెబ్రిటీలు సైతం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదిస్తుంటారు.
సెలెబ్రిటీల విషయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ అక్షయ్ కుమార్ గురించి చెప్పుకోవాలి. దేశంలో అత్యధిక సంపాదన ఉన్న నటుల్లో అక్షయ్ కుమార్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. వరల్డ్ వైడ్ గా తీసుకుంటే 35 వ స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్ మ్యాగజైన్ తెలిపిన సంగతి తెలిసిందే. సంవత్సరానికి అతని ఆదాయం రూ.444 కోట్ల రూపాయలు. ఇంట సంపాదిస్తున్న అక్షయ్ 100 పౌండ్ల కోసం ఏం చేశారో తెలుసా...
లండన్ లో ఓ ప్లేస్ లో ఐరన్ రాడ్ ను పట్టుకొని ఎక్కువగా సేపు వేలాడితే.. వాళ్లకు 100 పౌండ్లు బహుమతిగా ఇవ్వబడును అని రాసుంది. వెంటనే అక్షయ్ కుమార్ ఆ ఇనుప రాడ్ ను పట్టుకొని చాలా సేపు వేలాడారు. దీనిని వీడియో గా తీసి అయన భార్య ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. సరదా కోసం చేసినా.. దేని కోసం చేసినా.. చివరకు డబ్బే పరమావధి అని చెప్పొచ్చు. ఎన్ని కోట్లు ఉన్నా రూపాయితో మొదలవ్వాల్సిందే కదా.