టాలీవుడ్ యంగ్ హీరో..అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ మొదటిసారి అన్నీ సౌత్ లాంగ్వేజెస్ లో కలిపి సినిమా విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మించే డియర్ కామ్రేడ్ సినిమాను తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆయా భాషల్లో జనాల్లోకి తీసుకెళ్లడం కోసం విజయ్ ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. ఇంతకముందు ఎప్పుడు ఏ సినిమాకి కష్టపడనంతగా ఈ సినిమాకోసం కష్టపడుతున్నాడు.. అంతేకాదు..ప్రమోషన్స్ విషయంలోను ఫుల్ గా ఇన్వాల్వ్ అయి మరీ ప్రమోట్ చేస్తున్నాడు. ఇక కొన్ని సీన్స్ ని మళ్ళీ రీ షూట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. 

ఇక ఇప్పటికే బెంగుళూరు, కోచ్చిలో ఫంక్షన్ లు చేసి, హీరోయిన్ రష్మిక మడొన్నాతో కలిసి హల్ చల్ చేసారు విజయ్ దేవరకొండ. అన్ని భాషల్లో సినిమాకు క్రేజ్ తీసుకురావడం కోసం తన సమయాన్ని ఎక్కువగా ఈ సినిమాకే కేటాయిస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఓ పాటను మూడు భాషల్లో ముగ్గురు హీరోలు పాడుతున్నారు. ఇది ఒక హైలెట్ అని చెప్పొచ్చు.

దీనికోసం కూడా విజయ్ నే చొరవ తీసుకుని, ఆయా హీరోలను సంప్రదించి ఒప్పించాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతి ఆ పాటను పాడగా, తెలుగులో విజయ్ దేవరకొండనే పాడేసాడు. విజయ్ ఇలా పాట పాడడం ఇది రెండోసారి. మొత్తంమీద డియర్ కామ్రేడ్ విడుదలకు ముందే రకరకాల హడావుడి సృష్టిస్తోంది. మరి ఈ సినిమా విజయ్ కి ఎలాంటి సక్సస్  ను ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: