ఒక‌ప్పుడు సినిమాలో హీరోయిన్ల ప‌ర్స‌నాలిటీ ఇలాగే ఉండాల‌ని లేదు.  బొద్దుగా ఉన్నా ముద్దే అన్న రీతిలో ఉండేది. సావిత్రి, వాణిశ్రీ ఇలా కాస్త బొద్దుగా ఉన్నా వారు న‌టించేవారు. కానీ ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితులు లేవు. ఏమాత్రం కాస్త లావున్నా అవ‌కాశాలు రావ‌డం క‌ష్టంగానే ఉంది. అది ఎంత పెద్ద టాప్ హీరోయిన్ అయినా స‌రే. ప‌ర్స‌నాలిటీ అనేది మెయిన్‌టెయిన్ చెయ్యాల్సి వ‌స్తుంది. 


ఇక‌పోతే భాగ‌మ‌తి విజ‌యం త‌రువాత సరైన క‌థ కోసం వెయిట్ చేస్తూ కొంత గ్యాప్ తీసుకుంది అనుష్క‌. ఆ స‌మ‌యంలోనే హేమంత్ మ‌ధుక‌ర్ వినిపించిన క‌థ‌కు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇది కూడా నాయికా ప్రాధాన్య‌త క‌లిగిన క‌థ‌నే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జ‌రుగుతోంది.


మాధ‌వ‌న్ కీల‌క‌మైన పాత్ర‌ను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. తెలుగుతో పాటు త‌మిళ‌.. హిందీ భాష‌ల్లోను ఈ సినిమాను ద‌స‌రాకి విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నారు. అందువ‌ల‌న తెలుగుతో పాటే కొన్ని స‌న్నివేశాల‌ను త‌మిళ‌.. హిందీ భాష‌ల్లో అక్క‌డి న‌టీన‌టుల‌తోనే షూట్‌క చేస్తున్నారు. తెలుగులో నిశ్శ‌బ్దం టైటిల్‌తోను, త‌మిళ‌.. హిందీ భాష‌ల్లో సైలెన్స్ టైటిల్‌తోను ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: