టలీవుడ్ హీరోల మధ్యన  సఖ్యత, స్నేహం బాగానే ఉంటోంది. ఒకరి సినిమాలు ఒకరు పొగుడుకుంటారు. ఇక ఒకరి హిట్లను మరొకరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇంతటి అనుబంధం మరింతగా విస్తరించేందుకు కూడా ఇపుడు  అడుగులు పడుతున్నాయి. ఓ స్టార్ హీరో బ్యానర్లో మరో హీరో నటించే పరిస్థితి కూడా ఇక్కడే కనిపిస్తోంది. 


 యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఒక‌వైపు భారీ చిత్రాల‌ను నిర్మిస్తూనే మ‌రోవైపు మినిమ‌మ్ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తూ ముందుకెళ్తోంది.  ఇక ప్ర‌భాస్ తో దాదాపు 300 కోట్ల‌తో భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తోన్న ఈ సంస్థ మ‌రో మినిమమ్ బ‌డ్జెట్ లో నాగ చైత‌న్య‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. 


వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణార్జునుల యుద్ధం చిత్రాల ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంద‌ట‌. ఇప్ప‌టికే కొంత కాలంగా ఈ స్క్రిప్ట్ పై వ‌ర్క్ చేస్తున్నాడ‌ట ద‌ర్శ‌కుడు గాంధీ. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య వెంకీమామ‌ తో పాటు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 


ఇప్ప‌టికే వెంకీ మామ కంప్లీట్ అయింది. శేఖ‌ర్ క‌మ్ముల సినిమా పూర్త‌య్యాక యువి క్రియేష‌న్స్ వారికి చైతు డేట్స్ కేటాయించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. అప్పట్లో అక్కినేని వారి బ్యానర్లో  ప్రభాస్ పెదనాన్న క్రిష్ణం రాజు నటించారు. ఈ తరంలో చైతూ , ప్రభాస్ ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: