ఎనర్జిటిక్ స్టార్ రామ్- పూరీ జగన్నాథ్ కాంబోలో రిలీజ్ అవుతున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రంలో నిధి అగార్వల్, నాభ నటేష్ కథానాయికలుగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు చార్మీ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేశారు.
ఈ సినిమాపై అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న కీలకమైన నాలుగు థియేటర్లు సంధ్య 35 ఎంఎం, సంధ్య 70 ఎంఎం, సుదర్శన్ 35 ఎంఎం, తారకరామ థియేటర్లన్నీ ఈ చిత్రానికే కేటాయించారు. అలాగే ఈ సినిమాకు సోలో రిలీజ్ కూడా కలిసొచ్చింది.హైదరాబాద్లో అర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే పెద్ద పెద్ద సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి చోట్ల పెద్ద పెద్ద సినిమాలకే మూడు, నాలుగు థియేటర్లే ఇవ్వరు.
అలాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న ఎక్కువ థియేటర్లను ఒకే సినిమాకి కేటాయించడం అంటే స్టార్ హీరోలకే సాధ్యం అవుతుంది. కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రామ్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’కు నాలుగు ప్రధాన థియేటర్లను కేటాయించారు. ప్రస్తుతం అక్కడ అంతా ఇస్మార్ట్ శంకర్ హంగామానే నడుస్తోంది అంటే ప్రేక్షకుల్లో ఏ స్థాయి క్రేజ్ నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా ఈ సినిమాకు ఒక రికార్డు లాంటిదే.