కీర్తీ సురేశ్ నటించిన మహానటి ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. అప్పటిదాకా కీర్తి సురేశ్ కు ఉన్న ఇమేజ్ ఈ ఒక్క సినిమాతో మారిపోయింది. కీర్తి సురేశ్ ఎంత మంచి నటి అనే విషయం మహానటి ద్వారానే అందరికీ తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ మహానటి సినిమాలో నటించే అవకాశం కీర్తి సురేశ్ కంటే ముందు అమలా పాల్ కు వచ్చిందట. 
 
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథను అమలా పాల్ కు వినిపించాడట. కథ నచ్చినప్పటికీ అదే సమయంలో భర్తతో విభేదాలుండటంలాంటి కారణాల వలన అమలా పాల్ మహానటి సినిమాకు ఓకె చెప్పలేదట. అమలా పాల్ నటించిన "ఆమె" సినిమా షూటింగ్ ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని చెప్పింది. ఒకవేళ మహానటి సినిమాలో అమలా పాల్ నటించి ఉంటే మాత్రం కెరీర్ మరో విధంగా ఉండేదని చెప్పవచ్చు. 
 
మహానటి సినిమాలో నటించే చాన్స్ నిత్యామీనన్ దగ్గరికి కూడా వెళ్ళిందట. ముందు  నిత్యామీనన్ ఓకె చెప్పినప్పటికీ తరువాత కొన్ని కారణాల వలన వద్దనుకుందట. అలా అమలపాల్, నిత్యామీనన్ ఇద్దరూ వద్దనుకోవటంతో ఆ చాన్స్ కీర్తి సురేశ్ కు దక్కింది. మహానటి బ్లాక్ బస్టర్ కావటంతో కీర్తి సురేశ్ కు తెలుగు, తమిళంలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేశ్ తెలుగులో మన్మధుడు2 సినిమాలో నటిస్తుంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: