తెలుగులో బిగ్ బాస్ మూడో సీజన్ కు సమాయాత్తమవుతోంది. ఇంటా. బయటా కూడా ఇటువంటి వివాదాలు ఈ షోకి మామూలే. దీంతోనే బిగ్ బాస్ కు ఎనలేని పాపులారిటీ వచ్చేస్తుంది. ఎన్టీఆర్, నాని వరుసగా రెండు షోలకు హోస్ట్ గా వ్యహరిస్తే ఈ మూడో షోకి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

 

 

ఈసారి బిగ్ బాస్ కు కొత్త తలనొప్పులు వచ్చాయి. యాంకర్ కం జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, ఫిదాలో నటించిన గాయత్రి గుప్తా తమను నిర్వాహకులు సెక్సువల్ ప్రశ్నలతో ఇబ్బందులకు గురి చేసారని పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టారు. తాజాగా ఓయూ విద్యార్థులు షో బ్యాన్ చేయాలని నాగార్జున ఇంటిముందు ధర్నా చేశారు. కొందరు మహిళలు ఈ షోను రాత్రి 11 తరువాత ప్రసారం చేయాలని కోర్టులో కేస్ ఫైల్ చేశారు. ఇలా ఈ షోకి హైప్ తోపాటు వివాదాలు మునుపు రెండు షోలకు రానన్ని వచ్చాయి.

 

 

ఈ వివాదాలపై నాగార్జున కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఈ షోను కొన్నిరోజులు వాయిదా వేయాలని నిర్వాహకులను కోరినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు షో నిర్వాహకులు ఈనెల 19న బిగ్ బాస్ షోను, నాగార్జునతో ప్రెస్ మీట్ ఆరెంజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. మరి దీనిపై నిర్వాహకులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: