ఈ మద్య స్టార్ హీరోయిన్లు గ్లామర్ మాత్రమే కాదు నటనాపరంగా మెప్పుపొందాలని తెగ తాపత్రయపడుతున్నారు. ఇక సినీ పరిశ్రమలో ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది.   భర్తతో విడాకులతో అప్పట్లో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని వివాదాలతో వార్తల్లోకెక్కింది. ఇటీవల తన భర్త రెండో పెళ్లిపై కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా అమలాపాల్ నటించి ఆడై తెలుగు లో  'ఆమె' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ మూవీలో అమలాపాల్ డిఫరెంట్ యాంగిల్స్ లో కనిపించబోతుందట.

అంతే కాదు ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటించినట్లు కనిపిస్తుంది.  అమలాపాల్ నగ్నంగా నటించిన సన్నివేశాలు, పోస్టర్లు ఇప్పటికే వివాదంగా మారాయి. అమలాపాల్ మాత్రం తను నగ్నంగా నటించడాన్ని సమర్ధించుకుంటోంది.మరోవైపు ఆమె అలా నటించినందుకు కొంత మంది సెలబ్రెటీలు విమర్శిస్తే..మరికొంత మంది గొప్పగా పొగిడిన విషయం తెలిసిందే.

అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమాలో నగ్న దృశ్యాలు, ఆ సినిమా పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని,  కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసింది.

ఈ మూవీలో అలాంటి దృశ్యాలు తొలగించకపోతే తాము ఆందోళనకు దిగుతామని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొంది. విడుదలకు ఎలాంటి అడ్డులేనప్పటికీ మరి ఈ దృశ్యాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: