ఏంటి ఈ టైటిల్ అని అనుకుంటున్నారా ? అందరూ అదే అనుకుంటారు మరి ! అలాంటి పేరు పెట్టారు .. 'ఎవరు' పెట్టారు ? అని అనుకుంటున్నారా ? ఇంకెవరు పెడుతారండి అలాంటి ఉత్కంఠ భరితమైన పేర్లు సినిమాలకు పెట్టెది 'అడవి శేష్'. ప్రస్తుతం సినిమా పేరే 'ఎవరు'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. 


ఈ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ 'ఎవరు' సినిమా నుంచి ఈరోజు సాయింత్రం టీజర్ రానుంది. ప్రేక్షకులను ఊరిస్తూ ఈ సినిమా టీజర్ గురించి ఓ పోస్ట్ విడుదల చేసారు అడవి శేష్. ఈ రోజు సాయింత్రం 4 గంటలకు విడుదలయ్యే 'టీజర్ లాంచ్ చేసేది ఎవరు ?' అంటూ పోస్ట్ విడుదల చేశారు. 


ఈ పోస్ట్ కి ఫ్యాన్స్ స్పందిస్తూ వెయిట్ చేస్తున్నాం 'ఎవరు' రిలీజ్ చేస్తారు అనేది చుడటానికి అని కామెంట్ చేస్తున్నారు. క్ష‌ణం, గూఢచారి వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో అలరించిన అడవి శేష్ ఇప్పుడు 'ఎవరు' చిత్రంతో మన ముందుకు రానున్నారు. కాగా ఈ చిత్రంలో అడవి శేష్ కథానాయకుడిగా రెజీనా క‌సండ్ర కథానాయికగా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: