తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ కృష్ణ తనయుడు మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించి సూపర్ స్టార్ గా  ఎదిగారు.  ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.  మహేష్ బాబు తన సహనటి అయిన నమ్రతా శిరోడ్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయన కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం. ఏడాదికి ఒకటీ రెండు సార్లు విదేశాల టూర్ కి వెళ్లి వస్తుంటారు. 

మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే మూవీలో నటించారు.  ఆయన కూతుర సితార ఎప్పుడు సోషల్ మీడియాలో తన అల్లరి పనులతో హల్ చల్ చేస్తుంది.  తాజాగా ఈ చిన్నారి మరో అద్భుతం చేసింది. పిట్ట కొంచెం..కూత గనం అన్న చందంగా మ‌హేశ్ కుమార్తె సితార డిజిట‌ల్ రంగంలోకి అడుగుపెట్టారు.

సితార‌, డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కుమార్తె ఆద్యాతో క‌లిసి ‘ ఏ అండ్ ఎస్’ పేరుతో యూ ట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ఇది చిన్ని పిల్లల కోసం..వారిలో సృజనాత్మకత వెలికి తీయడానికి ఏర్పాటు చేసి యూ ట్యూబ్ ఛానెల్. ఈ ఛానెల్‌లో తొలి వీడియో కూడా పోస్ట్ చేశారు. 3 మార్కర్స్ ఛాలెంజ్ పేరుతో వీరిద్ద‌రూ బొమ్మ‌ల‌కు క‌ల‌ర్స్ వేయ‌డంలో పోటీ ప‌డ్డారు. ఈ వీడియోను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ పేజ్‌లో పోస్ట్ చేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: