అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కృష్ణ గారి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇంత చిన్న పిల్లాడు ఏం నటిస్తాడబ్బా అనుకున్నవాళ్ళే ఎక్కువ. కానీ వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ నాన్నతో పోటీగా నటించి పోరాటం మొదలుకుని బాలచంద్రుడు దాకా జైత్రయాత్ర అలా కొనసాగించాడు మహేష్. ఇప్పటికీ టీవీ ఛానల్స్ ఈ సినిమాలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇక నేనేం తక్కువా అంటూ మహేష్ తనయ సితార కూడా సినిమాల్లో కాదు కానీ యుట్యూబ్ వేదికగా తన టాలెంట్ ని పరిచయం చేసే పనిలో పడింది.


మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురుతో కలిసి ఇద్దరి పేర్లు వచ్చేలా ఆద్యా అండ్ సితార అని కొత్త ఛానల్ మొదలుపెట్టేసింది. అంతే కాదు త్రి మార్కర్ ఛాలెంజ్ అనే వీడియో కూడా ఈ చిచ్చరపిడుగులు అప్ లోడ్ చేసేశారు. ఇకపై ఇందులో చిన్నపిల్లలను ఆకట్టుకునే వీడియోలు ఆటలు విదేశీ విశేషాలు కాంటెస్టులు బోలెడు ఉంటాయట. కిడ్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా దీనికి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మిలియన్ల మోత మోగడం ఖాయం. 


వృత్తిపరంగా అనుబంధం ఏర్పడినా అంతకన్నా ఎక్కువ బాండింగ్ తో మహేష్ వంశీ ఫ్యామిలీస్ కలివిడిగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో ఎదిగిన స్నేహమే ఈ సితార ఆద్యల యుట్యూబ్ ఛానల్ కి దారి తీసింది. పిల్లలు ఇలాంటి వయసులోనే ఇంత క్రియేటివ్ గా ఆలోచించడం కన్నా తండ్రులకు కావాల్సింది ఏముంది. మహేష్ అది పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు కాబోలు


మరింత సమాచారం తెలుసుకోండి: