టాలీవుడ్ లో మెగాస్టార్ పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్  150’సినిమాతో మళ్లీ వెండి తెరపై మెరుపులు మెరిపించారు.  డ్యాన్స్, ఫైట్స్,కామెడీ లో తనకు ఎదురే లేదని నిరూపించారు.  అప్పటి వరకు మెగాస్టార్ స్టామినాపై రక రకాల చర్చలు వచ్చినా వాటన్నింటికి తన సినిమాతో జవాబు ఇచ్చాడు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’మూవీలో నటిస్తున్నారు. 

ఈ మూవి షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. ఈ మూవీ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అమితాబచ్చన్, నయనతార,సుదీప్ లాంటి స్టార్లు నటిస్తున్నారు.  మరో ప్రత్యేక పాత్రలో అనుష్క, తమన్నా నటిస్తున్నారు.  ఈ మూవీ అక్టోబర్ 2 న తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. తెలుగు లో ఈ చిత్రానికి ఏ పోటీ సినిమా లేనప్పటికీ..హిందీలో మాత్రం గట్టి పోటీనే ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.  బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ షరఫ్ నటించిన ‘వార్’ మూవీ రిలీజ్ కాబోతుంది. 

ఈ మూవీ పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉండబోతుందని ఇటీవల టీజర్ ని బట్టి చూస్తే తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా కు వార్ ఎఫెక్ట్ పడనుందా..ఇప్పుడు ఇదే బాలీవుడ్ సర్కీల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సైరా సినిమాతో సై అన్నబోతున్నాడు. ఈ వార్‌లో గెలిచేదెవరో అని అందరు చర్చించుకుంటున్నారు. సైరా మూవీ బాలీవుడ్ లో భారీగా విడుదల చేయాలనీ చరణ్ ప్లాన్. పైగా సినిమాలో బిగ్ బి అమితాబ్ కూడా ఉండడం తో సినిమాకు మరో ఆకర్షణ అయ్యింది. సైరా రిలీజ్ డేట్ నాడే హృతిక్ రోషన్ వార్ సినిమారాబోతుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: