తెలుగు ఇండస్ట్రీలో లెజెండ్ చిత్రంతో విలన్ గా మారిన జగపతిబాబు తర్వాత వరుస చిత్రాలతో బిజీగా మారిపోయారు.  ప్రస్తుతం విలన్ గా నటిస్తున్న జగపతిబాబు తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న  'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఉన్నట్టుండి ఈ మూవీ నుంచి ఆయన తప్పుకున్నట్లు వార్తలు రావడంలో ఎందుకు ఈ మూవీ నుంచి తప్పుకున్నారనే దానిపై చర్చలు నడుస్తున్నాయి.

ఇంతకు ముందు మహేశ్ బాబు - జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' .. 'మహర్షి' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈ మూవీ నుంచి ఆయన ఎందుకు తప్పుకున్నారో అసలు రహస్యం చెప్పారు.

ఈ సినిమాలో తన పాత్ర గురించి ముందుగా ఏదైతే చెప్పారో, షూటింగుకి వెళ్లాక ఆ స్థాయిలో తన పాత్ర లేదనే సందేహం జగపతిబాబుకి కలిగిందట. అదే విషయాన్ని ఆయన దర్శకుడి దగ్గర ప్రస్తావించడం .. అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందని అంటున్నారు. అంతే కాదు తన పాత్ర రూపకల్పనలో మార్పులు చేయడం నచ్చకపోవడం వల్లనే జగపతిబాబు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: