ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈరోజు విడుదలైంది. టెంపర్ సినిమా తరువాత పూరీ జగన్నాథ్ కు సరైన హిట్ రాలేదు. నేను శైలజ సినిమా తరువాత హీరో రామ్ కు కూడా సరైన విజయం దక్కలేదు. ఫ్లాపులో ఉన్న ఇద్దరూ కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ కు హిట్ టాక్ రావటంతో పూరీ జగన్నాథ్, రామ్ కలిసి మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమా " ఇస్మార్ట్ శంకర్" సినిమాకు సీక్వెల్ గా ఉంటుందని తెలుస్తుంది. 
 
ఈ సీక్వెల్ సినిమాకు "డబుల్ ఇస్మార్ట్ " అనే టైటిల్ పెట్టి ఈ టైటిల్ రిజిష్టర్ కూడా చేయించారట. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కథ, కథనం రొటీన్ గానే ఉన్నా రామ్ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాడు. కొన్ని సాధారణ సన్నివేశాల్లో కూడా రామ్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు వస్తున్నాయి. మణిశర్మ అందిన పాటలు యావరేజ్ గానే ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. 
 
నిర్మాతగా కూడా పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను మీడియం బడ్జెట్లో నిర్మించటంతో భారీగా లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది. వీకెండ్ వరకు ఈ సినిమాకు ఇప్పటికే టికెట్స్ ఆన్లైన్లో సేల్ అయిపోయాయి. మాస్ ప్రేక్షకుల ఆకలి తీర్చేలా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఉంది. రేపు కూడా డబ్బింగ్ సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతూ ఉండటంతో డియర్ కామ్రేడ్ రిలీజ్ అయ్యేదాకా ఇస్మార్ట్ శంకర్ కు పోటీ లేనట్లే. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: