పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన సినిమా కావడంతో మొదటి రోజు థియేటర్ల ఆక్యుపెన్సీ బాగుందని సాయంత్రానికే రిపోర్టులు వచ్చాయి. కాకపోతే అక్కడక్కడ మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నా ఓవరాల్ గా చూస్తే పూరి గత సినిమాలకంటే చాలా బెటర్ అంటున్నారు. అంతేకాదు పూరీ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. దీంతో పూరి గురువుగారు రామ్ గోపాల్ వర్మ తెగ ఎగ్జైట్ అయ్యారు.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా శిష్యుడిని అభినందిస్తూ ట్వీట్ చేశారు "హే.. పూరి జగన్నాథ్ & రామ్ మీరు క్షణం ఆలస్యం చేయకుండా ఇస్మార్ట్ శంకర్ 2 ను మొదలు పెట్టండి అంటూ ఫుల్ జోష్ లో ట్వీట్ చేస్తూ...డబల్ దిమాక్ కు బదులుగా అది ట్రిపుల్ దిమాక్ అయి ఉండాలి" అంటూ శిష్యుడిపై తన ప్రేమను కురిపించారు. దీనికి పూరి జగన్నాథ్ రిప్లై ఇస్తూ "సర్.. డబల్ ఇస్మార్ట్ టైటిల్ ను ఇప్పటికే రిజిస్టర్ చేశాం" అంటూ సీక్వెల్ టైటిల్ ని ఆవేశంలో ఎగ్జైట్ అవుతూనే అధికారికంగా వెల్లడించాడు. దీనికి మళ్ళీ గురువుగారు రాం గోపాల్ వర్మ "వా.......వ్.  అది ఇంకా బెటర్" అంటూ డబల్ ఇస్మార్ట్ టైటిల్ సూపర్ అంటూ తెలిపాడు.

అంతేకాదు "హే ఛార్మీ.. రేపు నేను మీ ఇస్మార్ట్ శంకర్ టీమ్ తో పార్టీ చేసుకునేందుకు వస్తున్నాను" అంటూ పార్టీ డిక్లరేషన్ ఇచ్చాడు. ఇంకేముంది.. ఇస్మార్ట్ టీమ్ అంతా 
"ఛోడ్ చింతా మార్ ముంతా"..! అంటూ పార్టీలో రచ్చ చేసేస్తారనమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: