రజినీకాంత్ ఇండియాలో సూపర్ స్టార్ నటుడు.   అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో రజినీకాంత్ ఒకరు.  అందులో ఎలాంటి సందేహం లేదు.  వయసు 60 దాటినా ఇప్పటికి రజినీకాంత్ తన నటనతో అదరగొడుతున్నారు.  అయన సినిమా వస్తుంది అంటే సందడే సందడి.   తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంటుంది. 


ముంబై సంగతి చెప్పక్కర్లేదు.  తమిళ ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ ఆయన సినిమాలు భారీ స్థాయిలో ఆడుతుంటాయి.  ప్రస్తుతం రజినీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో దర్భార్ సినిమా చేస్తున్నాడు.  ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.   సినిమా సమయంలో ఎంత హుందాగా ఉంటారో.. రియల్ లైఫ్ లో అంత నిరాడంబరంగా ఉంటారు.  


దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.  అందులో ఒకటి దళపతి సినిమా సమయంలో జరిగింది.  దళపతి సినిమా సమయానికి రజినీకాంత్ సూపర్ స్టార్.  ఆ సినిమాలో అరవింద్ స్వామి కూడా ఉన్నారు.  మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంటున్నారు.   ఓరోజు షూటింగ్ ముగిశాక ఓ సంఘటన జరిగింది.  


షూటింగ్ ముగిసిన తరువాత అరవింద్ స్వామీ బాగా అలసిపోయాడు.  పడుకోవడానికి ఓ రూమ్ కి వచ్చాడు.  అప్పటికే ఆ రూమ్ లో పక్క సిద్ధం చేసి ఏసీ వేసి ఉంది.  చల్లగా ఉండటంతో హ్యాపీగా నిద్రపోయాడు.  తెల్లారి చూసే సరికి రజినీకాంత్ మంచం పక్కన కింద పడుకొని ఉన్నారట.  అది చూసి అరవింద్ స్వామి షాక్ అయ్యారు. 


వెంటనే అసిస్టెంట్ ను పిలిచి అడిగితె.. అది రజినీకాంత్ కు కేటాయించిన రూమ్ అని, మీరు నిద్రపోతున్నారని లేపవద్దని చెప్పి.. అయన కింద పడుకున్నట్టు అసిస్టెంట్ చెప్పారట.  అది విన్న అరవింద్ స్వామి షాక్ అయ్యారు.  రజినీకాంత్ సామాన్యుడిగా ఉండేందుకు ఎక్కవ ఆసక్తి చూపుతారు అనడానికి ఇదొక నిదర్శనం.  


మరింత సమాచారం తెలుసుకోండి: