ఈ సారి సైమా అవార్డ్స్ లో ఉత్తమ హీరోగా రామ్ చరణ్ కు రావొచ్చని తెలుస్తుంది. ప్రతియేటా సైమా అవార్డ్స్ వేడుకలు ఏదో ఒక గల్ఫ్ దేశంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఖతార్- దోహాలో ఈ వేడుకను ఆగస్టు 15- 16 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడికి తెలుగు-తమిళ- కన్నడ- మలయాళ చిత్రాలకు చెందిన పలువురు స్టార్లు హాజరుకానున్నారని తెలుస్తోంది.


ఈసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి 2018 చిత్రాల్లో రంగస్థలం-భరత్ అనే నేను- గీత గోవిందం- అరవింద సమేత- మహానటి చిత్రాలు పోటీపడుతున్నాయి. ఉత్తమ నటుడు కేటగిరీలో దుల్కర్ సల్మాన్(మహానటి)- మహేశ్ (భరత్ అనే నేను)- ఎన్టీఆర్ (అరవింద సమేత వీర రాఘవ)- రామ్ చరణ్(రంగస్థలం)- సుధీర్ బాబు (సమ్మోహనం)- విజయ్ దేవరకొండ(గీతగోవిందం) పేర్లు నామినేషన్లలో ఉన్నాయి.


ఈసారి సైమా అవార్డుల్లో మెజారిటీ పురస్కారాలు `రంగస్థలం` చిత్రానికి దక్కనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో చిట్టిబాబు గా రామ్ చరణ్ .. రామలక్ష్మిగా సమంత నటనకు అద్భుత ప్రశంసలు దక్కాయి. చిట్టిబాబుకు ఉత్తమ నటుడుగా అవార్డు దక్కడం ఖాయం అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తమ నటి కేటగిరీలో మహానటి సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ కి ఉత్తమ నటి పురస్కారం దక్కనుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: