కొన్ని సార్లు మన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగితే అబ్బే మాకెందుకు ఈ గోల అని పక్కకు తప్పుకునేవారు చాలా మంద ఉంటారు.  ఎవరై ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నా కూడా తమ కెమెరాతో షూట్ చేసేవారు ఉన్నారు కానీ వారికి కాపాడేవారు లేకుండా పోయారు.  అదే సినిమాల్లో అయితే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే హీరో వెంటనే వెళ్లి వారిని కాపాడుతారు.

బ్రిడ్జి పైనుంచి దూకితే మోదీ స్కార్పియో ఇస్తారని పేపర్లో చదివానని, అందుకే బ్రిడ్జి పైనుంచి దూకేస్తున్నానంటూ హైదరాబాద్, అత్తాపూర్‌ బ్రిడ్జిపై ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఆ సమయంలో  సినీ నటుడు ఇంద్రసేన చాకచౌక్యంగా ఆ యువకుడిని కాపాడారు. గురువారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  వివరాల్లోకి వెళితే..అత్తాపూర్‌ బ్రిడ్జిపై దూకుతానని ఓ వ్యక్తి హల్‌చల్ ఆ సమయంలో కింద నుంచి అతన్ని దూకవొద్దని వారించారు.. ఆ పక్కనే ఉన్న సెలబ్రిటీ జిమ్‌లో ఉన్న సినీ నటుడు ఇంద్రసేన సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తిని కాపాడాడు.

జిమ్‌లో ఉన్న ఇతర యువకులను అప్రమత్తం చేశాడు. ఆ యువకుడి వద్దకు వెళ్లి చిన్నగా మాటల్లో పెట్టి వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఉత్తరాదికి చెందిన వ్యక్తిగా ఆ  యువకుడిని గుర్తించారు. బ్రిడ్జిపై నుంచి ఎందుకు దూకాలనుకుంటున్నావన్న ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అంతే కాదు బ్రిడ్జిపై నుంచి దూకితే మోదీ స్కార్పియో ఇస్తారన్న విషయం తాను పేపర్లో చదివానని పిచ్చి సమాధానాలు చెప్పడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: