ఫిలిం ఇండస్ట్రీలో ఒకొక్కరికి ఒకొక్క సెంటిమెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు యంగ్ హీరో అడవి శేషుకు సమంత పై ఏర్పడ్డ సెంటిమెంట్ హాట్ న్యూస్ గా మారింది. ప్రభాస్ ‘సాహో’ విడుదల వాయిదా పడటంతో ఆగష్టు 15 డేట్ ను అడవి శేషు తన ‘ఎవరు’ సినిమాకు అనుకూలంగా మార్చుకున్నాడు.

లాంగ్ వీకెండ్ రావడంతో ఈ హాలిడేస్ ను తన మూవీకి అనుకూలంగా మార్చుకోవాలని శేషు ఇప్పటి నుండే ‘ఎవరు’ మూవీ ప్రమోషన్ మొదలు పెట్టేసాడు. ఈరోజు సాయంత్రం ఈమూవీ టీజర్ ని అడవి శేషు సమంతతో విడుదల చేయిస్తున్నాడు. 

అయితే ఇతడి సినిమాకు సమంతకు మధ్య ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను శేషు తన ట్విటర్ లో తెలియచేసాడు. ‘డియర్ సమంత రూత్ ప్రభు మీరు మహేష్ తో కలిసి క్షణం టీజర్ ఆవిష్కరించారు. అలాగే గూఢచారి టీజర్ ని పర్సనల్ గా వచ్చి లాంచ్ చేశారు. ఆ రెండు సినిమాలు గొప్పగా గర్వించదగ్గ సక్సెస్ ని ఇచ్చాయి. మీరు నిజంగానే లక్కీ లేడీ’ అంటూ ఇప్పుడు తన ‘ఎవరు’ టీజర్ ను కూడ సమంత విడుదల చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సమంత అక్కినేని కుటుంబానికి మాత్రమే కాకుండా తనకు కూడ లక్కీ లేడీ అంటూ కామెంట్ చేసాడు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక పోస్టర్ లో ‘మిస్సింగ్ కేస్ ఫైల్’ అంటూ ఓ ఫైల్ ని పట్టుకుని కనిపిస్తున్నారు శేష్. దానిపై తమిళనాడు పోలీస్ డిపార్ట్ మెంట్ అని రాసి ఉంది. వర్మ అనే వ్యక్తి మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన కథ ఇది అని తెలుస్తోంది. ఈమూవీలో అడవి శేషు వాసు దేవన్ అనే పోలీసు అధికార పాత్రలో కనిపించబోతున్నాడు. మరి అడవి శేషు నమ్మకాన్ని సమంత ఈసినిమాకు ఎటువంటి సక్సస్ ను ఇస్తుందో చూడాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: