మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తర్వాత చిరు కొరటాల శివ తెరకెక్కించే సినిమాలో నటించనున్నాడు. చిరు కెరీర్ లో కొరటాల సినిమా 152వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే చిరు... బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారా ? అంటే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ లో అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా గుణ 369 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ తాను బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా తీస్తున్నట్టు అఫిషియల్గా అనౌన్స్ చేశాడు. అరవింద్ ఈ ప్రకటన చేసిన వెంటనే పక్కనే ఉన్న కార్తికేయ ఆ సినిమాలో హీరో నేనేనా సార్ అనడంతో అరవింద్ వెల్ కంటు గీతా ఆర్ట్స్ అని అన్నారు. అరవింద్ కార్తీకేయకు క్యాజువల్గానే వెల్ కం అని చెప్పినా... చిరు సినిమాలో కీలక పాత్రను కార్తీకేయకు ఆఫర్ చేశారంటున్నారు.
అన్నయ్య సినిమాలో రవితేజ తరహాలో ఆ పాత్ర ఉంటుందని కూడా టాక్ నడుస్తోంది. వాస్తవానికి చిరు సినిమా కోసం బోయపాటి ఎప్పుడో కథ రెడీ చేసుకున్నాడు. అయితే మధ్యలో వినయ విధేయ రామ తర్వాత కాస్త ఈ ప్రాజెక్టు సైలెంట్ అయ్యింది. ఇప్పుడు కొరటాల సినిమా తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందని... ఓ కీలక రోల్కు కార్తీకేయను తీసుకోవచ్చని అంటున్నారు. కార్తికేయ కొత్త సినిమా గుణ 369 వచ్చే నెల 2న విడుదల కాబోతోంది.