మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమా `ఏఏ19`. అయితే ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్కు ఒక సినియర్ కో డైరక్టర్కు మధ్య జరిగిన వివాదంలో ఈ సినిమా షూటింగ్ మూడునాలుగు రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అయితే ఆ సినియర్ కో డైరక్టర్ రజామౌళి, ఎమ్ ఎస్ రెడ్డి లాంటి మహామహుల దగ్గర పని చేశారు. ఇటు త్రివిక్రమ్తో కూడా ఎంతో మంచిగా ఉంటారని, ఆయన గొడవలు పడే వ్యక్తి కాదని, చాలా మంచి వ్యక్తి అని టాక్. మరి ఏమైందో పూర్తిగా తెలియకపోయినా బన్నీకి... ఆ కో డైక్టర్ మధ్య ఏర్పడిన వివాదంలో బన్నీ ఆయనపై కేకలు వేశాడట.
దీంతో ఆ కో డైరక్టర్ కోపానికి గురయ్యారట. అలాగే ఈ విషయంలో దర్శకుల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని ఆ సీనియర్ కో డైరక్టర్ మొదట్లో అనుకున్నారట. అయితే అందరూ కలిసి ఆయనకు సర్ది చెప్పడంతో ఈ గొడవంతా సర్దుమనిగింది. ఈ గొడవ తర్వాత రిలేక్స్సేషన్ కోసం మూడు రోజులు షూటింగ్ వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.