విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ కెకె’. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ ఎం సెల్వ దర్శకుడు. తమిళ్లో కదరం కొండెన్ పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో మిస్టర్ KK పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో ? తెలుసుకుందాం..
ఈ కథ మలేషియాలో జరుగుతుంది. అక్కడకు గర్బవతి అయిన అక్షరహాసన్ తన భర్తతో కలిసి ఉంటుంది. మరో పక్క విక్రమ్పై కొందరు ఎటాక్ చేయడంతో.. తీవ్రంగా గయపడిన విక్రమ్ను అక్షరహాసన్ భర్త రక్షించి హాస్పటల్లో జాయిన్ చేస్తారు. అదే సమయంలో పోలీస్ అధికారిగా లీనా ఎంట్రీ ఇవ్వడంతో ఊహించని విధంగా అక్షరహాసన్ కిడ్నాప్ అవుతుంది. దీనికి విక్రమ్ కారణమని, అతని గ్యాంగ్ విక్రమ్ను సేవ్ చేయడానికి ఇలా చేశారని పోలీసులు భావిస్తారు.
దీంతో అక్షర హాసన్ భర్త విక్రమ్ పోలీస్లకు హింట్ ఇవ్వడం... మరో వైపు లీనా పోలీస్ అధికారి చేతిలో మరణించడం జరుగుతుంది. సెకండాఫ్లో మిస్టరీ రివీల్ అవుతుంది. ఓ బిజినెస్ మ్యాన్ మర్డర్ కేసులో పోలీసులు విక్రమ్ను ఇరికించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే తప్పించుకున్న విక్రమ్ను ఛేజ్ చేసి తన దగ్గర ఉన్న సాక్షాలు నాశనం చేయాలని చూస్తారు.
తాను నిర్దోషిని అని నిరూపించుకునే ఫ్రూప్స్ విక్రమ్ దగ్గర ఉండడంతో పోలీసులు వాటిని నాశనం చేసేందుకు ప్లాన్ చేస్తూ అతడిని వెంటాడతారు. చివరకు అసలు హంతకులు దొరికిపోతారు. కథ ముగుస్తుంది. దర్శకడు రాజేష్ కేవలం యాక్షన్, చేజింగ్ల మీదే కాన్సంట్రేషన్ చేసి సినిమాపై ఆసక్తి పోగొట్టేశాడు. సినిమా ఎంత మాత్రం ఆకట్టుకోలేదు. ఓవరాల్గా సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న విక్రమ్కు మరో సారి చేదు అనుభవంగా మిగిల్చినట్లైంది.