యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రం సాహో. రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన బాహుబలి రెండు భాగాల అద్భుత  విజయాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ విపరీరమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండడంతో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. 

ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇకపోతే సినిమాను మొదట ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల చేయాలని  భావించారు. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, హఠాత్తుగా సినిమా రిలీజ్ ను మరొక 15 రోజులు పోస్ట్ ఫోన్ చేస్తూ, యూనిట్ తాజాగా తమ సినిమా విడుదల డేట్ ని ఆగస్టు 30 అని ప్రకటిస్తూ కాసేపటిక్రితం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు మన తెలుగు సినిమా చరిత్ర ప్రకారం చూసుకుంటే, 

ఇలా పలు మార్లు విడుదల తేదీలు వాయిదా పడుతూ వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్ అయినవి ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ విషయమై కొందరు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, నిజానికి సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకుడు అవేవి పట్టుంచుకోడని, కాబట్టి సాహోలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా కనుక ఉన్నట్లయితే, హిట్ కొట్టడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే ఆగస్టు 30న సాహో ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: