ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్ తరహాలోనే ప్రస్తుతం ‘ఒన్ బకెట్’ ఛాలెంజ్ సోషల్‌మీడియాను ఊపేస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ‘ఒన్ బకెట్’ ఛాలెంజ్‌ ప్రారంభమైంది. దీని ఉద్దేశం ఓ వ్యక్తి రోజు మొత్తంలో ఒక్క బకెట్ నీళ్లు మాత్రమే వినియోగించాలి. ప్రస్తుతం చెన్నై ఎదుర్కొంటున్న నీళ్ల కష్టాలు భవిష్యత్‌లో హైదరాబాదీలకు రాకూడదన్న ఉద్దేశంలో సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. 


ఈ నెల 21న హైదరాబాద్‌లోని వారంతా నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తమ అవసరాల కోసం కేవలం ఒక్క బకెట్‌ వాటర్‌నే వాడాలన్నది ఈ ఛాలెంజ్ ఉద్దేశం. ఈ ఛాలెంజ్‌ను ఇప్పటికే వరుణ్ తేజ్ , సాయిధరమ్ తేజ్, అడవి శేష్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ స్వీకరించి మిగతా వారికి ఛాలెంజ్ విసిరారు. 


‘ఓ బేబీ’గా మారి టాలీవుడ్‌ను ఊపేస్తున్న అక్కినేని వారి కోడలు సమంత కూడా తాజాగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించింది. ‘నాతో ఎవరు కలుస్తారు? వన్ బకెట్ ఛాలెంజ్. స్నానం ఎక్కువసేపు చేయడం, వాహనాలను కడగడం, ముఖం కడిగేటప్పుడు టాప్ తిప్పి తిప్పే ఉంచడం పనులు చేయను. నా బకెట్ ఛాలెంజ్ ఫోటోను పోస్ట్ చేస్తాను. ఇందులో చీటింగ్ ఉండదు’ అంటూ సమంత ట్వీట్ చేసింది. సమంత ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ చాలామంది నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. ‘నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా సమంత.. ఆ రోజు నేను నదిలో స్నానం చేస్తా’ అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: