తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ చేయడంతో ఈ రియాల్టీ షోకి మంచి హైక్ వచ్చింది.  ఆ తర్వాత బిగ్ బాస్ 2 సీజన్ కి నాని హూస్ట్ గా వ్యవహరించారు..మొదట్లో కొన్ని విమర్శలు వచ్చినా తర్వాత మంచి ఎంట్రటైన్ మెంట్ గా ముగిసింది.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 విషయంలో ఇంటి సభ్యుల మద్య నెలకొన్నం వివాదాలు తర్వాత సోషల్ మీడియాలో వచ్చినా తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. 

బిగ్ బాస్ సీజన్ 2 కి కౌశల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం బిగ్ బాస్ 3 పై ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. బిగ్ బాస్ లోని కొంత మంది తమను లైంగికంగా వేధించారని..అగ్రిమెంట్ విషయంలో ఇబ్బంది పెట్టారని..యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని..సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఉద్యమానికి సిద్దమయ్యారు.

అంతే కాదు ఈ షోని నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వంటి నిర్మాతలు పిటిషన్ దాఖలు చేశారు.  ఈ క్రమంలో బిగ్ బాస్ 2 విజేత కౌశల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.  బిగ్ బాస్ ఔత్సహిక కళాకారులకు మంచి వేదిక అని..తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇదో మంచి అవకాశ అని దీనిపై వస్తున్న రూమర్లను ఖండించారు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్.

ఈ కార్యక్రమం ఎంపిక చేసే ప్రాసెస్ ఎంతో ని జాయితీగా ఉంటుందని చెప్పారు. బిగ్ బాస్ మూడో సీజన్ లో పాల్గొనబోయేవారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. 'ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. మీరు రైడ్ ఎక్కబోతున్నారు' అంటూ బిగ్ బాస్ 3 కంటెస్టంట్స్ కి చెప్పారు కౌశల్. 


మరింత సమాచారం తెలుసుకోండి: