క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, టబు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం "నిన్నే పెళ్ళాడతా". అప్పట్లో ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అదే టైటిల్ తో మరో సినిమా మన ముందుకు రాబోతుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు  "అమన్" హీరోగా అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ పతాకాలపై బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలిగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

ఈ చిత్రానికి వైకుంఠ బోసు దర్శకత్వం వహించగా, లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నాగార్జున చేతుల మీదుగా జరిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు వైకుంఠ బోసు మాట్లాడుతూ, చిత్ర లోగోని ఆవిష్కరించిన మన్మధుడు నాగార్జునకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. అలాగే నాగర్జున హిట్ చిత్రం నిన్నే పెళ్ళాడతా టైటిల్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందని చెప్పాడు.

 

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, లోగో ఆవిష్కరణకి నాగార్జున రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే నాగార్జున గారి మన్మధుడు 2 సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.  ఇంకా డైరెక్టర్ బోసు చెప్పిన కథ వెరైటీగా ఉందని, తమకు బాగా నచ్చిందని, ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్టులు చాలా బాగా నటిస్తున్నారని, పాటలు కులుమనాలీలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.

 

అమన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయి కుమార్, సీత, ఇంద్రజ,సిజ్జు, అన్నపూర్ణమ్మ, మధునందన్ మిగతా పాత్రలు పోషించారు.ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వైజాగ్ లో చివరి షెడ్యూలు పూర్తి చేసుకుని  అక్టోబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.     ఈ చిత్రానికి సంగీతం నవనీత్ అందిస్తున్నారు. కథ కథనం

 దర్శకత్వం వైకుంఠ బోసు.

మరింత సమాచారం తెలుసుకోండి: