టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సంచలన తార అమలాపాల్ నటించిన ‘ఆమె’మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది.  రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ప్రధానపాత్రలో నటించిన ‘ఆమె’ సినిమా మొదటి నుంచీ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. అమలాపాల్ ఈ మూవీలో బోల్డ్ గా నటించింది. ఆ మద్య రిలీజ్ అయిన టీజర్ లో అమలాపాల్ నగ్నంగా కనిపించి అందరిని షాక్ కి గురిచేసింది. అమలాపాల్ ఇలా బోల్డ్ గా నటించడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై  కొంతమంది ఆమె ధైర్యానకి మెచ్చుకుంటే..మరికొంత మంది ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. 

కాగా, ఈ సినిమాలో అమలాపాల్ కొన్ని సీన్లలో నగ్నంగా నటించడంపై మహిళా సంఘాలు సినిమాకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్ర మార్నింగ్ షోలు రెండు తెలుగురాష్ట్రాల్లో రద్దయ్యాయి.  దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. ఈ చిత్రానికి ఉన్న వివాదాలు ఓ కారణం అని కొందరు అంటుండగా.. ఆర్థిక పరమైన సమస్యల వల్ల విడుదల కాలేదనే టాక్ కూడా వినిపిస్తోంది.

నగరంలోని ప్రధాన కూడళ్లలో అమలాపాల్ నగ్న పోస్టర్లు ఏర్పాటు చేయడాన్ని మహిళా సంఘాల సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల చిన్నారులు, టీనేజర్లపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అడల్ట్ సినిమాలతో ప్రజలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నించారు. ఆ పోస్టర్లను తగులబెట్టారు..చెప్పుతో కొట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: