పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఛార్మీ నిర్మాత‌గా గురువారం విడుద‌ల అయిన సినిమా `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా భారీ వ‌సూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రెండు రాష్ట్రాల ప‌రంగా తొలి రోజులోనే 8 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ కమెడియన్ భద్రం మాట్లాడుతూ చిత్ర దర్శకుడు పూరి.. నిర్మాత ఛార్మీలపై ట్విట్ట‌ర్‌లో కామెంట్లు చేశాడు.


అయితే భ‌ద్రం విష‌యానికి వ‌స్తే రియల్ లైఫ్ లో అయన డాక్టర్.. కానీ రీల్ లైఫ్ కోసం యాక్టర్ అయ్యారు. అటు వృత్తి ప‌రంగా డాక్ట‌ర్‌గా.. ఇటు యాక్ట‌ర్‌గా కూడా త‌మ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటాడు. ఈయన తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను చూశాడట. వాస్త‌వానికి ఈ సినిమాపై త‌న అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్‌లో పంచుకుంటూ  పూరి జగన్నాధ్ సర్.. ఛార్మీ మేడమ్ పై నేను కేసు ఫైల్ చేయబోతున్నాను అని ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది.


అయితే ఇది సీరియ‌స్‌గా కాదు... నేను రోజూ మెడిటేషన్ చేస్తాను. అయితే ఈ సినిమాలో 'ఇస్మార్ట్ శంకర్' ది ఛోడ్ చింతా మార్ ముంతా ఫిలాసఫీ..  ఈ ధ్యానాలకు తపస్సులకు డెడ్ యాంటీగా ఉండ‌డం.. దీంతో ఎవ‌రికైనా ఆ ఇంపాక్ట్ లోనుంచి బైటకు రావాలంటే కొంత టైమ్ ప‌డుతుంద‌ని అన్నారు. అలాగే ఈ ఇస్మార్ట్ వీకెండ్ ను ఎంజాయ్ చెయ్యండ‌ని కూడా ట్వీట్ చేశాడు.  ఇలా ఈ సినిమాపై అభిప్రాయాన్ని తెలియ‌జేస్తు పూరి.. ఛార్మీల‌పై కేసు వేస్తానంటూ స‌ర‌ద‌గా ట్విట్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: