దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు రజినీకాంత్ హీరోగా నటించిన పేటా మూవీని చిత్రీకరించి హిట్ అందుకున్నారు. కార్తిక్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఒక చిత్రాన్నీ మూడేళ్ల క్రితమే రావాల్సిందని  కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదని తెలిపారు.

ధనుష్ తో చేసిన చిత్రం తర్వాత కార్తిక్ మెర్క్యూరీ, పేట సినిమాల మీద ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం దర్శకుడు కార్తిక్ "వై నాట్ స్టూడియో" బ్యానర్ పై హీరో ధనుష్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లుగా ఆయన తెలిపారు. ఈ చిత్రంలో ధనుష్ కి జంటగా మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు.


ఈ ముద్దుగుమ్మ మళయాళంలో మాయనది, వరదన్ వంటి చిత్రాలను తీసి వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతుంది. అంతేకాక విశాల్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న చత్రంలో రెండో హీరోయిన్ గా మన మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సుందర్శి దర్శకత్వం వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: