ఒకటి కాదు..రెండు కాదు పదుల సంఖ్యలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కావొచ్చు..అతి వేగం కావొచ్చు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మద్య సెలబ్రెటీల వాహనాలుకు రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. తాజాగా రోడ్డు ప్రమాదంలో బాలనటుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది.
ఛత్తీస్గడ్ రాయ్పూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో హిందీ టీవీ సీరియళ్లలో నటించిన పాపులర్ అయిన శివలేఖ్ సింగ్ (14) దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత టీవీ నటి శోభ కారు ప్రమాదంలో కన్ను మూశారు. కన్నడలో పలు టీవీ సీరియల్స్లో ఆమె నటించారు.
కర్ణాటకలోని బనశంకరి గుడికి 8 మందితో కలిసి కారులో వెళుతుండగా, కారు టైర్ పేలి ట్రక్కుని ఢీకొంది. ఈ ప్రమాదంలో శోభతో పాటు ఆమె ఫ్యామిలీకి సంబంధించి అశోక్, శ్యామల, సుకన్య, మంజులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. మగలు జానక్కిసీరియల్లో ఆమె నటిస్తుంది.
ఈ సీరియల్ కన్నడ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమని తెలుస్తుంది. ఆమె రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన విషయం తెలుసుకున్న సీరియల్ దర్శకుడు టీఎన్ సీతారామ్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె ఆత్మకి శాంతి చేకూరాని కోరారు. పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.