కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాలో మహేష్ కి తండ్రిగా అద్భుతంగా నటించాడు జగపతిబాబు. సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో జగపతి బాబు చేసిన తండ్రి క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా ఇటీవల మహర్షి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్..అనిల్ రావిపూడి డైరెక్టర్ తో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ పాత్రలో నటిస్తున్నాడు.


అంతేకాకుండా ఈ సినిమా సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. దీంతో సినిమాలో జగపతిబాబు కూడా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి తర్వాత..అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి జగపతిబాబు బయటకు రావడంతో..మహేష్ బాబు - జగపతి బాబు ల గురించి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వార్తలు రావడంతో...వెంటనే సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి జగపతిబాబు వస్తున్న వార్తలపై స్పందించారు. జగపతి బాబు మాట్లాడుతూ 'నా 33 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడూ ఏ చిత్రం గురించి వివరణ ఇవ్వలేదు. చిత్ర పరిశ్రమ నా ఫ్యామిలీ లాంటిది.


అందుకే ఎక్కువగా మాట్లాడను. కానీ ఒక విషయంలో తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సి వస్తోంది. సరిలేరు నీ కెవ్వరు చిత్రం నుంచి తాను తప్పుకున్నానని అనేక వార్తలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఆ చిత్రం నుంచి నేను తప్పుకోలేదు.. కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నానంతే. వివరణ ఇవ్వడంతో పాటుగా మహేష్ బాబు సినిమా కోసం రెండు సినిమాలు త్యాగం చేశానని పేర్కొన్నారు జగపతిబాబు. కొన్ని పరిస్థితుల్లో ఇలాంటివి కామన్...అంతేకానీ ఇష్టానుసారంగా మంచిగా ఉన్న మనుషుల మధ్య ఇటువంటి పరిస్థితులను చులకనగా తీసుకొని ఏది పడితే అది రాయకూడదని సోషల్ మీడియాలో తన గురించి మహేష్ బాబు గురించి రాస్తున్న వారి పై మండి పడ్డాడు జగపతిబాబు. 



మరింత సమాచారం తెలుసుకోండి: