ఎన్నాల్లో వేచిన ఉదయం..ఈనాడే ఎదురవుతుంటే.. అనే పాట పాడుకుంటున్నారు ‘ఇస్మార్ట్ శంకర్’చిత్ర యూనిట్. టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి జగన్నాధ్, నేనుశైలజ సినిమా తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న రామ్ పోతినేన కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’మాస్ హిట్ అని చెబుతున్నారు. అయితే ఈ మూవీకి ఇంత హైప్ రావడానికి కారణం మొదటి నుంచి డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రమోషన్ పై ఎక్కువ దృష్టి పెట్టడం. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి డిఫరెంట్ యాంగిల్స్ లో ‘ఇస్మార్ట్ శంకర్ ’ ని ప్రమోట్ చేస్తూ వచ్చారు.
గురువారం విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ కి ముందు నిమాకి సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్ లో హీరో రామ్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో రక రకాల సందేహాలు మొదలయ్యాయి. పూరీ జగన్నాథ్కి , రామ్కి పడడం లేదని ఆ కారణంగా రామ్ ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదని ప్రచారం చేశారు.
అయితే అసలు విషయం ఎవ్వరికీ తెలియకపోవడం వల్లే ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయని రామ్ సన్నిహితులు తెలుపుతున్నారు. అసలు విషయానికి వస్తే.. ఇస్మార్ట్ శంకర్ మూవీ ముందుగా జూలై 12న విడుదల అవుతుందని అన్నారు. దాంతో రామ్ 12 తర్వాత తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడు. అన్ని బుకింగ్స్ కూడా పూర్తి చేశాడు... కాని అనుకోకుండా ఈ మూవీ రిలీజ్ డేట్ 18కి పోస్ట్ పోన్ అయ్యే సరికి రామ్ ప్రమోషన్స్లో పాల్గొనలేకపోయాడు.
దాంతో అటు టూర్ ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టలేక, రామ్ ప్రమోషన్స్లో పాల్గొనలేకపోయాడని.. అంతే తప్ప పూరీ, రామ్ల మధ్య మనస్పర్థలు తలెత్తాయన్న మాట అవాస్తవం అని ఆయన సన్నిహితులు అంటున్నారు .