సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్ లో వచ్చిన 25వ సినిమా మహర్షి రూపంలో ఇటీవల సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక అయన హీరోగా ప్రస్తుతం తన కెరీర్ 26వ సినిమాగా రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లోనే కాదు ఇటు టోటల్ టాలీవుడ్ వర్గాల్లోనూ విపరీతమైన అంచనాలున్నాయి. 

మహేష్ సరసన యంగ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జోడి కడుతున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎన్నో ఏళ్ల తరువాత సినిమాల్లోకి మళ్ళి రిఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు ముగ్గురు కలిసి అత్యంత భారీ ఖర్చుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల కాశ్మీర్ లో ఎంతో అట్టహాసంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. హీరో మహేష్ తో పాటు మరికొందరు ఆర్టిస్టులు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారని, మహేష్ గారితో తాను ఎంతో ఎంజాయ్ చేస్తూ పనిచేసిన ఈ అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిదని, 

ఇక తమ సినిమా రెండవ షెడ్యూల్ ఈనెల 26నుండి హైదరాబాద్ లో జరుగుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి కొద్దిసేపటి క్రితం తన సోషల్ మిడియా ఖాతాల్లో పోస్ట్ చేసారు. అంతేకాదు అయన సూపర్ స్టార్ మహేష్ పోస్టర్ కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ వరుసగా ముచ్చటగా మూడవసారి మహేష్ బాబు సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు పని చేస్తున్నారు. మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్, ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: