మహేష్ బాబుతో పూరి జగన్నాధ్ 'పోకిరి' ఇంకా 'బిజినెస్ మన్' చిత్రాలు చేసిన విషయం తెల్సిందే, ఈ రెండు సినిమాలు మహేష్ కెరీర్ ని ఎంత బూస్ట్ ఇచ్చాయి, తన ఇమేజ్ ని ఎలా పెంచాయి కూడా అందరికి తెలిసిందే. ముఖ్యంగా పోకిరి అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి, హీరోయిజం అంటే ఇది అనే తీరు కి తెచ్చింది . బిజినెస్ మాన్ తర్వాత వీరిద్దరి కాంబోలో 'జనగణమన' చిత్రం రావాల్సి ఉంది, కానీ అది ఎందుకో సెట్స్ మీదకి వెళ్ళలేదు . అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ అది ఎందుకు సెట్స్ పైకి వెళ్ళలేదు కారణం వెల్లడించారు ఇటీవల ఇచ్చిన ఓకే టీవీ ఇంటర్వ్యూ లో.


తాజాగా పూరి 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో 'జనగణమన' ఎప్పుడు అంటూ ప్రశ్నించగా నేను ఎప్పుడైతే హిట్స్ లో ఉంటానో అప్పుడే నాతో మహేష్ బాబు సినిమాను చేసేందుకు ముందుకు వస్తాడంటూ పూరి కామెంట్స్ చేశాడు. సక్సెస్ లో ఉంటేనే మహేష్ తనతో సినిమా చేస్తాడంటూ పూరి చేసిన వ్యాఖ్యలపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు, ఇప్పటికే ట్రోల్ల్స్ మరియు పూరి కి సపోర్ట్ కూడా సోషల్ మీడియా లో మొదలైంది. 


గతంలో పూరి వరుసగా ఫ్లాప్ లు తీసినా కూడా పోకిరి సినిమా ఛాన్స్ ఇచ్చాడు మహేష్ బాబు తన ట్రాక్ రికార్డు ని పట్టించుకోకుండా. ఆ తర్వాత కూడా సక్సెస్ లేకుండా ఉన్న పూరికి బిజినెస్ మన్ తో మళ్లీ బూస్ట్ ఇచ్చాడు. అలాంటి మహేష్ గురించి పూరి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడంటూ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మహేష్ సక్సెస్ లను చూసి సినిమా చేస్తాడంటూ పూరి వ్యాఖ్యలను ఫ్యాన్స్ అర్థం చేసుకుని రెచ్చి పోతున్నాడు. మరి పూరి ఉద్దేశ్యం ఏంటో ఆయన మళ్లీ స్పందిస్తే అప్పుడు క్లారిటీ వచ్చేను. 


మరింత సమాచారం తెలుసుకోండి: