"సరిలేరు నీకెవ్వరు" అనే సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు అనీల్ రావిపూడి, ఇందులో ప్రధాన పాత్రను సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించమని జగపతిబాబును కోరారు ఈ చిత్ర యూనిట్.


ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం కాశ్మీర్ లోని పరిసర ప్రాంతాల్లో తీస్తున్నారు. ఇలా షూటింగ్ జరుగుతుండగా కొన్ని రోజులకు జగపతిబాబు ఈ సినిమాను చేయట్లేదని పలు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా కోసం జగపతిబాబు పలు సినిమాలను వదులుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి.


దీనిపై జగపతిబాబు స్పందిస్తూ ఈ సినిమా నుంచి జగ్గూభాయ్ కొన్ని కార్ణాల వల్ల తప్పుకుంటున్నారని చెబుతూ, అలాగే మహేష్ బాబు, అనీల్ రావిపూడికి అతని టీమ్ కు తన బెస్ట్ విషెస్ ను తెలిపారు. జగపతిబాబే స్వయంగా చెప్పడం వల్ల ఈ కథ ఇక్కడితో ముగిసిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: