కార్తిక్ సుబ్బరాజ్ తమిళంలో దర్శకుడిగా మంచి పేరును సంపాదించుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ గా మెర్క్యురి సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రముఖ డాన్స్ మాస్టర్, డైరెక్టర్, హీరో ప్రభుదేవా, రమ్య నంబీషన్ జంటగా నటించిన ఈ సినిమా కమ్ర్షియల్ సక్సస్ ను సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'పేట' చిత్రాన్ని రూపొందించే అవకాశాన్ని దక్కించుకున్నాడు కార్తీక్ సుబ్బరాజు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులను సైతం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాతో కూడా మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు కార్తిక్ సుబ్బరాజ్.
అయితే వాస్తవానికి మూడేళ్ల క్రితమే ధనుష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు కార్తిక్ ప్రకటించారు. అందుకు తగ్గ ప్రణాళికలు కూడా సిద్దం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సాధ్యపడలేదు. ఆ తర్వాత 'మెర్క్యురి', 'పేట' సినిమాలపై దృష్టి పెట్టి హిట్స్ ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ధనుష్ హీరోగా ఓ సినిమాను రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు కోలీవుడ్ మీడియా సమాచారం. ఇక ఈ సినిమాను వైనాట్ స్టూడియో బ్యానరుపై తెరకెక్కించనున్నారని లేటెస్ట్ న్యూస్.
అంతేకాదు ఈ సినిమాలో ధనుష్కు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మీ నటించనుందట. మలయాళంలో మాయనది, వరదన్ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఈ బ్యూటీ అగ్రనాయికగా పేరు సంపాదించుకొని పాపులర్ అయింది. ఇప్పుడు ధనుష్తో జోడీ కడుతోంది. అంతేకాకుండా సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా నటిస్తున్న సినిమాలో కూడా రెండో హీరోయిన్గా ఈమె ఎంపికైందని ఫ్రెష్ న్యూస్.