అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్షణం, గూఢచారి వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అడవి శేష్ మళ్ళీ 'ఎవరు' అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 


ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి టీజర్ ప్రముఖ నటి 'సమంత' చేతులు మీదగా విడుదల చేయించారు. టీజర్ మొత్తం ఉత్కంఠంగా, సస్పెన్స్ తో ప్రేక్షకుల మనసుని ఊరించాడు అడవి శేష్. అసలు కథ ఏంటి అంటే ఒక యువతిని ఓ వ్యక్తి రేప్ చెయ్యబోతే ఆ వ్యక్తిని కాల్చి చంపేస్తుంది ఆమె. దీంతో ఆ మర్డర్ వెనుక ఉన్న నిజం బయటపెట్టుందుకు ప్రయత్నిస్తాడు అడవి శేష్. అసలు ఆ హంతకుడు ఎవరు ? అనేదానిపై సినిమా మొత్తం నడుస్తుంది. 


ఇంతటి సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్ చూసిన అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. అడవి శేష్ అంటేనే భారీ అంచనాలు పెట్టుకునే అభిమానులు ఈ టీజర్ చూసిన అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో కథనాయకగా రెజీనా కసాండ్రా నటించగా, కీలక పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నారు. ఆగస్ట్ 15 న ఈ చిత్రం విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: