మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో...చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో...నటిస్తున్నాడు. దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో...తెరకెక్కిన ఈ సినిమా లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ..మహామహులు..కూడా నటిస్తున్నారు.


ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతున్న క్రమంలో..చెర్రీ తన తండ్రి చిరంజీవి సైరా సినిమా కోసం..కొత్త తరహా ప్రచారానికి తెరలేపినట్లు ఫిలింనగర్ లో వినబడుతున్న టాక్. విషయంలోకి వెళితే ప్రస్తుతం సెలబ్రిటీలు చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా అంతగా యాక్టివ్గా లేని రామ్ చరణ్ తాజాగా ఇటీవల ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసాడు.


ఈ సందర్భంగా తనకు సంబంధించిన విషయాలను తెలియ చేస్తూ మరో పక్క...తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న సైరా సినిమా యొక్క విశేషాలను కూడా పోస్ట్లు పెడుతూ చాలా తెలివిగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు రామ్ చరణ్. ఇటువంటి తరుణంలో త్వరలోనే చిరంజీవి సైరా సినిమా యాక్టర్ మేకింగ్ వీడియోను విడుదల చెర్రీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తంమీద రామ్ చరణ్ సోషల్ మీడియాని తాను నిర్వహిస్తున్న సైరా సినిమా ప్రమోషన్ కి చాలా తెలివిగా వాడుకుంటున్నారు అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: