సుధీర్ బాబు హీరోగా చేసిన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది నభా నటేష్. ఆ సినిమా సూపర్ హిట్టైంది. నభా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది.
పూరి జగన్నాధ్ సినిమా. రామ్ పోతినేని హీరో. ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో తెలిసిందే. పూరి ఈజ్ బ్యాక్ అనే విధంగా సినిమా ఉంది. మొదటి సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన నభా, ఈ సినిమాలో గ్లామర్ తో రెచ్చిపోయింది.
అందచందాలతో పిచ్చెక్కించింది. నిధి అగర్వాల్ తో సమానంగా స్కిన్ షోను ప్రదర్శించింది. నభా గ్లామర్ షో ను చూసి దర్శక నిర్మాతలు ఫిదా అయ్యినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజతో డిస్కో రాజా సినిమా చేస్తున్నది.
ఒకరకంగా ఇది పెద్ద సినిమానే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది. ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు. టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు అన్ని అర్హతలు ఈ అమ్మడిలో ఉన్నాయి. మరి చూద్దాం ఎంతవరకు ఎదుగుతుందో.