సుధీర్ బాబు హీరోగా చేసిన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది నభా నటేష్.  ఆ సినిమా సూపర్ హిట్టైంది.  నభా తన నటనతో ఆకట్టుకుంది.  ఈ సినిమా తరువాత తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది.  


పూరి జగన్నాధ్ సినిమా.  రామ్ పోతినేని హీరో. ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో తెలిసిందే.  పూరి ఈజ్ బ్యాక్ అనే విధంగా సినిమా ఉంది.  మొదటి సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన నభా, ఈ సినిమాలో గ్లామర్ తో రెచ్చిపోయింది.  


అందచందాలతో పిచ్చెక్కించింది.  నిధి అగర్వాల్ తో సమానంగా స్కిన్ షోను ప్రదర్శించింది.  నభా గ్లామర్ షో ను చూసి దర్శక నిర్మాతలు ఫిదా అయ్యినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు రవితేజతో డిస్కో రాజా సినిమా చేస్తున్నది.  


ఒకరకంగా ఇది పెద్ద సినిమానే.  ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది.  ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు.  టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు అన్ని అర్హతలు ఈ అమ్మడిలో ఉన్నాయి.  మరి చూద్దాం ఎంతవరకు ఎదుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: