మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి సూపర్ హిట్లు వచ్చాయి. పూరీ జగన్నాథ్ "జనగణమన" అనే టైటిల్తో ప్రత్యేకంగా మహేశ్ బాబు కోసం కథ సిధ్ధం చేసాడు. కానీ మహేశ్ బాబు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపకపోవటంతో ఈ సినిమా మొదలుకాలేదు.ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ పూరీ మహేశ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని అడిగింది. 
 
ఈ ప్రశ్నకు సమాధానంగా పూరీ జగన్నాథ్ మహేశ్ హిట్లలో ఉంటేనే సినిమాలు తీస్తాడని ఫ్లాప్స్ లో ఉంటే అవకాశమివ్వడని అర్థం వచ్చేలా మాట్లాడాడు. పూరీ జగన్నాథ్ మహేశ్ గురించి ఇలా అనేసరికి మహేశ్ ఫ్యాన్స్ పూరీని ట్రోల్ చేస్తున్నారు. పోకిరి సినిమా ముందు పూరీ జగన్నాథ్ తీసిన ఆంధ్రావాలా, 143, సూపర్ మూడు సినిమాలు ఫ్లాప్ సినిమాలని ఐనా మహేశ్ బాబు పూరీ జగన్నాథ్ కు అవకాశమిచ్చాడని మహేశ్ ఫ్యాన్స్ పూరీకి గుర్తు చేస్తున్నారు. 
 
బిజినెస్ మేన్ సినిమా ముందు కూడా పూరీ బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, నేనింతే, నేను నా రాక్షసి, గోలీమార్ లాంటి ఫ్లాప్ సినిమాలే తీసాడని ఐనా మహేశ్ బాబు అవకాశమిచ్చాడని మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోతో ప్రతి దర్శకుడు సినిమా తీయాలని అనుకుంటాడని అవకాశం ఇవ్వనంత మాత్రాన ఇలా అనడం తగదని పూరీని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. మరి పూరీ చేసిన కామెంట్స్ పై మహేశ్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: