హర్రర్ సినిమా 'దేవి 2' తర్వాత తమన్నా చాలా బిజీ హీరోయిన్గా మారిపోయ్యారు . తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరాలో కీలకపాత్ర పోషిస్తోంది. తెలుగులో సైరాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో కూడా విశాల్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. 'అదే కన్గల్' దర్శకుడు రోహిత్ వెంకటేశన్ దర్శకత్వంలోని ఓ సినిమాలో తమన్నా నటించబోతోంది. థ్రిల్లర్ కథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఈ అమ్మడు ముఖ్యపాత్ర పోషిస్తోంది.
యోగిబాబు, మునీష్కాంత్, సత్యన్ మోదలగువారు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'పెట్రోమాక్స్' అని వినూత్న టైటిల్ పెట్టారు. ఈగల్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్లుక్ను నిన్న నటి తాప్సీ ట్విట్టర్లో విడుదల చేశారు. ఓ కుర్చీలో తమన్నా తలకిందులుగా కూర్చుని ఉన్నట్లు ఫస్ట్లుక్ ఉంది. వెనుక ఆమెను చూసి యోగిబాబు, మునీష్కాంత్లు భయపడుతున్నట్టూ ఒక ఫ్రేమ్ లో కనిపిస్తోంది.
అయితే ఈ సినిమా కూడా 'దేవి' లాగా దెయ్యం చిత్రమేనా అని అనిపిస్తోంది. ఒక వేళ అదే అయితే తమన్న ఖాతాలో ఇంకొక హర్రర్ హిట్ పడే అవకాశం కనిపిస్తోంది.