తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బిగ్ బాస్, బిగ్ బాస్ 2 షో హిట్ అవ్వడంతో బిగ్ బాస్ 3 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు బుల్లితేరా ప్రేక్షకులు. అయితే బిగ్ బాస్ షో మాత్రం అనుకున్నట్టుగా రేపు ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. 


కారణం ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయిత్రి గుప్తా బిగ్ బాస్ నిలిపివేయాలని, రియాలిటీ షో పేరుతో బ్రోతల్ హౌస్ నడుపుతున్నారని, బిగ్ బాస్ వల్ల తెలుగు ప్రేక్షకులకు నష్టం తప్ప లాభం లేదని ఆరోపణలు చేసారు. దీంతో ఈ షో పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ 'షో'ని నిలిపివేయాలని విద్యార్థులు సైతం ఫిర్యాదులు చేశారు. 


దీంతో 'బిగ్ బాస్ షో'కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ షో నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. కారణం అక్కినేని వారు  తరతరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ వారి ఇంటి నుంచి ఎవరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు, వ్యక్తిగతంగా అయినా, సినిమా గురించి అయినా పోలీసుల చుట్టూ తిరగని నాగార్జున ఈ బిగ్ బాస్ షో వల్ల ఆలా చెయ్యాల్సి వస్తుందని 'షో'కి గుడ్ బై చెప్పేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటే ఎవరు షో 'హోస్ట్'గా ఎవరు వ్యవహరిస్తారు అనేది చూడాలి. కాగా ఈ షో రేపటి నుండి ప్రారంభం కానుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: