అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ పెళ్లి చేసుకుంటున్నాడా.. అది కూడా మళయాళ భామ నివేదా థామస్ ను అతను పెళ్లాడుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అదేంటి అసలు సుశాంత్, నివేదా కలిసి సినిమా కూడా చేయలేదే మరి వీరిద్దరికి ఎలా పెళ్లి జరిగింది అంటే ఇది కేవలం ఓ సినిమా కోసమే అని తెలుస్తుంది.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం డైరక్షన్ లో చేస్తున్న సినిమాలో సుశాంత్ నటిస్తున్నాడు. సినిమాలో నివేదా థామస్ కూడా బన్నికి సిస్టర్ గా నటిస్తుందట. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, నివేదాల పెళ్లి బన్ని దగ్గర ఉండి జరిపిస్తాడట. ఈ సినిమాలో టబు కూడా నటిస్తుందని తెలిసిందే.


హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఆల్రెడీ త్రివిక్రం, బన్ని కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. 


అక్కినేని హీరో సుశాంత్ లాస్ట్ ఇయర్ చిలసౌ సినిమాతో హిట్ అందుకున్నాడు. బన్ని సినిమాలో పాత్ర నచ్చగానే సినిమా ఓకే చేశాడు. త్రివిక్రం సినిమాలో చిన్న పాత్ర అయినా స్పెషల్ గా ఉంటుంది. అందుకే ఈ అక్కినేని హీరో ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేశాడు. ఈ సినిమాకు అలకనంద, నేను నాన్న టైటిల్స్ పరిశీలణలో ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: