సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ డూపర్ హిట్స్ తో రెండు వరుస విజయాల తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు.. ఆర్మీ అధికారి పాత్రలో నటిస్తున్నాడు.
సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల కాశ్మీర్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సహా, మరికొందరు ఆర్టిస్టులు పాల్గొన్న ఈ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయిందని, ఈ నెల 26 నుండి హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ప్రారంబించబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి కాసేపటి క్రితం ట్విట్టర్ లో పోస్ట్ చెశారు.
ఈ సినిమాలో జగపతి బాబు ఒక ముఖ్యపాత్ర పొషించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకున్నట్టు ఒక వీడియో సందేశం ద్వారా తెలియచేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో  ఇది తన మొదటి చిత్రం అని అది తను ఎప్పటికి మరువలేనని  అనీల్ తెలిపారు.  సూపర్ స్టార్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్న జోడి కడుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, రత్నవేలు సినెమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ సినిమాని 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు….!!


మరింత సమాచారం తెలుసుకోండి: