మామూలుగా ఒక సినిమా హిట్ అయితే అందులో నటించిన వారందరికీ పేరు వస్తుంది. ఫ్లాప్ లో ఉన్న వారు అయితే పండుగ చేసుకుంటారు. ఈ సక్సెస్ చూపించి మరిన్ని మూవీస్ చేయవచ్చు అని ఆశ పడతారు. అయితే తాజాగా విడుదల అయిన ఇస్మార్ట్ శంకర్  చూస్తే ముగ్గురుకి ఒక్కసారిగా బూం వచ్చినట్లైంది.


చాన్నాళ్ళుగా హిట్ కోసం తపిస్తున్న పూరీ జగన్నాధ్ మళ్ళీ లైం లైట్ లోకి వచ్చేశారు. ఆయన ఇపుడు ఏకంగా మహేష్ మీదనే బాణాలు వేసే రేంజికి రీచ్ అయిపోయారు. పూరీ మరిన్ని కొత్త ప్రాజెక్టులకు ఈ మూవీ మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇక మరొకటి ఏంటంటే హీరో రాం. ఆయన కూడా ఫ్లాప్స్ తో కొట్టుకుపోతున్నారు.


రాం కి ఇపుడు శంకర్ మూవీ మాస్ ఇమేజ్ భయంకరంగా ఇచ్చేసింది. దాంతో ఆయన కొన్నాళ్ళు దున్నేయడానికి వీలవుతుంది. ఇక అందాల ఆరబోతలో నభా నటేష్ మంచి మార్కులు కొట్టేసింది. పూరీ సైతం ఆమెకే ప్రయారిటీ ఇచ్చారని అంటున్నారు. బాగానే ఉంది. కానీ ఇపుడు మరో హీరోయిన్ నిధి అగర్వాల్ సంగతేంటి. ఆమె సైతం  హిట్ల కోసం కలవరిస్తోంది.


అయితే ఆమెకు పెద్దగా హైప్ క్రియేట్ కాలేదని, ఆమెకు మూవీలో ఉన్న సీన్లు కూడా తక్కువని అంటున్నారు. ఏది ఏమైనా హిట్ టాక్ వచ్చిన మూవీలో నటించడం తనకు హ్యాపీ అంటోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ మూవీ తరువాతనైనా నిధికి అవకాశాలు వస్తాయా. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: