ఆరోస్ అవతార్ ఎంటర్టైన్మెంట్ అండ్ సిల్లీ మొంక్స్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అశ్వమేధం'.  ధ్రువ కరుణాకర్  హీరోగా టాలీవుడ్ కు  పరిచయం చేస్తూ నూతన దర్శకుడు నితిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా  ప్రియా నాయర్, వందన యాదవ్, ఐశ్వర్య యాదవ్, శుభ మల్హోత్రా, రూపేష్ లు  నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. కాగా ఆగస్టు లో  విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను, మరియు పోస్టర్ ను  గురువారం సాయంత్రం  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  జెమినీ కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ లు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు.


హీరో దృవ్ కరుణాకర్ మాట్లాడుతూ.. థియేటర్స్ చేసాను. అప్పటినుంచి చాలా అఫ్ఫార్స్ వచ్చాయి కానీ తెలుగులో సినిమా చేయాలనే ఉద్దేశ్యం తో ఈ అశ్వమేధాన్ని ఎంచుకున్నాను. పోస్టర్స్ నన్ను బాగా ఆకర్షించాయి.  ఈ చిత్ర కథ ఇంట్రెస్టింగ్ గా అనిపించిది. ఈ సినిమా కోసం హొంగ్ కాంగ్ లో మషాల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా చేసాను. నన్ను నమ్మి నా కోసం కోట్లు పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలానే దర్శకుడు నితిన్ కు  కూడా తెలుగు లో మొదటి సినిమా నే. మంచి కథతో మీ ముందుకు వస్తునాడు. ఈ సినిమా మిమల్ని  ఆలోచింపచేసేలా ఉంటుంది. మొదటి సారి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాం ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. 


డైరెక్టర్ నితిన్ మాట్లాడుతూ... ఈ సినిమా లో చాలా మందే టాలెంటేర్స్ ఉన్నారు. అలానే హైలెట్స్ అయితే నిర్మాతలే వారే.. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ లు. ఎంతో సపోర్ట్ చేశారు. చాల ఎంకరేజ్ కూడా చేశారు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఇక మా సినిమాలో ముఖ్యంగా యాక్షన్స్ సీన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే హై లెట్స్ గా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆగస్టు లో మా సినిమా విడుదల ఉంటుందని చెప్పారు. సంజయ్ రెడ్డి, ప్రసన్న కుమార్, రూపేష్, ప్రియదర్శి, శివాంగి, సాన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: