‘టెంపర్’ తరువాత పూరీ జగన్నాథ్ కు నిజమైన సక్సస్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చింది అని వార్తలు వచ్చిన 24 గంటలు గడవకుండానే ఈమూవీకి ఊహించని షాక్ ఎదురైంది. తమిళ రాకర్స్ ఈమూవీని పూర్తిగా పైరసీ చేసి ఆన్ లైన్ లో పెట్టేయడంతో ఈ వీకెండ్ లో ఈమూవీకి భారీ కలక్షన్స్ వస్తాయి అని ఆశపడ్డ పూరీ రామ్ ల కలలకు అప్పుడే ఎదురీత ప్రాంరంభం అయింది. 

ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్ పై  ఎన్నిసార్లు నిషేదం విధించినా కొత్తకొత్త అడ్రెస్‌లు సృష్టించి నెటిజన్లకు దగ్గరవుతోంది. దీనితో ఈ సంస్థ చేస్తున్న అరాచకాల పై ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఏమి చేయలేక పోతున్నారు. వాస్తవానికి ఈ సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తులను తమిళనాడులో అరెస్ట్ చేసినా ఈ సైట్ ఇంకా రన్ అవ్వడంతో దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్న విషయం ఎవరికీ అంతు చిక్కని రహస్యంగా మారింది.

వాస్తవానికి ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి నిన్న రెండవ రోజు కలక్షన్స్ కూడ బాగున్న పరిస్థుతులలో ఈమూవీకి ఈ వీకెండ్ పూర్తి అయ్యే సరికి 25 కోట్ల నెట్ కలక్షన్స్ వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేసారు. దీనితో ఈమూవీని కొనుకున్న బయ్యర్లు ఈ వారాంతానికే లాభాలలోకి వెళ్ళిపోతారని పూరీ ఛార్మీలు భావించారు. 

అయితే ఇప్పుడు పూరీ ఛార్మీలకు దురదృష్టం తమిళ రాకర్స్ రూపంలో రావడంతో ఇప్పుడు పూరీ వెంటనే స్పందించి ఆన్ లైన్ లో ఈమూవీ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈమూవీ సక్సస్ ఇచ్చిన ఆనందంతో విదేశాలకు వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటున్న పూరీకి తమిళ రాకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: