మన టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎక్కువమంది హీరోలకు అభిమానులుగా ఉంటె అందులో కొందరు హీరోయిన్లకు సైతం అభిమానులుగా ఉండడం చూస్తుంటాం. ఇప్పటివరకు మన తెలుగు సినిమా పరిశ్రమకు ఎందరో హీరోయిన్లు వచ్చి, వెళ్లినప్పటికీ అందులో కొందరు మాత్రమే మన ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వారున్నారు. ఆ విధంగా 90వ దశకంలో తెరంగేట్రం చేసిన నటి సిమ్రాన్ ను మన ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదనే చెప్పాలి. ఆకట్టుకునే ఒడ్డు, పొడుగు మరియు బాడీ ఫిజిక్ తో ఉండే సిమ్రాన్, అప్పటి యువత పాలిటి కలల రాణి అనే చెప్పాలి. 

అయితే ఆమె మెల్లగా సినిమాల నుండి నిష్క్రమించిన తరువాత కొన్నేళ్ళకు ఇంచుమించు అదే విధమైన బాడీ మరియు అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ ఇలియానా. దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఇలియానా, అప్పట్లో యువత మనస్సులో చెరగని ముద్ర వేసింది. ఇక మళ్ళి ఇన్నేళ్లకు వారిద్దరిని పోలిన అందాలు, నవతరం నటి నిధి అగర్వాల్ లో కనపడుతున్నాయని అంటున్నారు కొందరు యువత. ఆకట్టుకునే అందంతో మంచి బాడి స్ట్రక్చర్ తో మెరిసే నిధిని చూస్తే ఆ మాట నిజమే అనిపించక మానదు. తొలుత మున్నా మైఖేల్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ భామ, తెలుగులో నాగ చైతన్య సరసన సవ్యసాచి ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. 

కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నిధికి అంతగా గుర్తింపు రాలేదు. ఆపై అఖిల్ తో కలిసి ఆమె నటించిన మిస్టర్ మజ్ను కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం ఆమె హీరో రామ్ తో కలిసి నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కలెక్షన్ల దుమ్ము దులుపుతుండడంతో అందరి కళ్ళు నిధి పై పడ్డాయి. ఇక యువత అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమె అందాలపై పొగడ్తలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే సిమ్రాన్, ఇలియానా తరువాత నిధి రాబోయే రోజుల్లో వారిలా తప్పకుండా మంచి పేరు గడిస్తుందని అప్పుడే కితాబిచ్చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నిధి అగర్వాల్ ఎంతటి విజయాలు అందుకుని కెరీర్ పరంగా ముందుకు సాగుతుందో వేచి చూడాలి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: