2016లో విడుదలైన నైను శైలజ సినిమా తరువాత రామ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. హైపర్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాల్లో ఏ సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. హలో గురు ప్రేమకోసమే సినిమా అంచనాలు అందుకోని సమయంలో ఈ సారి ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా తీస్తానని ఫ్యాన్స్ కు చెప్పాడు రామ్. ఇచ్చిన మాట ప్రకారం రామ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్టయ్యింది. 
 
16 కోట్ల బడ్జెట్తో తీసిన ఇస్మార్ట్ శంకర్ తొలిరోజే 8 కోట్ల షేర్ తెచ్చుకుంది. ఈ సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రుపాయలు వసూలు చేసింది. రామ్ ఈ మధ్య తీసిన సినిమాల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు, లాభాలు తీసుకొచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. కానీ ఈ సినిమా విషయంలో రామ్ ఇంకా పూర్తి సంతృప్తిగా లేడట. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్టైనా రామ్ నెక్స్ట్ సినిమా ఇంతకు మించిన హిట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. 
 
ఈ సినిమా విషయానికి వస్తే రామ్ నటనకు ఈ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది. సాధారణ సన్నివేశాలు కూడా రామ్ తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్ళాడని ప్రశంసలొచ్చాయి.రామ్ తన తరువాత సినిమా వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. భవిష్యత్తులో పూరీ జగన్నాథ్ రామ్ కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు "డబుల్ ఇస్మార్ట్" అని టైటిల్ పూరీ జగన్నాథ్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: