సౌత్ ఇండియా రౌడీగా మారిన విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్ర ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘డియర్ కామ్రేడ్’ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్’ పేరుతో కొచ్చి, చెన్నై, బెంగళూరులు చుట్టేసిన విజయ్ దేవరకొండ, రష్మికల జంట.. శుక్రవారం నాడు హైదరాబాద్‌‌లో హుషారెత్తించారు. ఆటపాటలతో స్టేజ్‌ను షేక్ చేశారు.  మ్యూజిక్ అంటే తనకి ఇష్టం అని, అందులో 'డియర్ కామ్రేడ్' ఆల్బం అంటే ఇంకా ఇష్టం అని, అందుకే రెగ్యులర్ గా కాకుండా ఒక పండుగలా దీన్ని సెలెబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది అని, దీన్ని మా ప్రొడ్యూసర్స్ ఓకే చేసారు కాబట్టే ఇక్కడ ఉన్నాం అని దేవరకొండ చెప్పడం జరిగింది.


ఆడియో వేడుకలు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల మాదిరిగా కాకుండా ‘డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్’ అంటూ యూత్‌ని మొత్తం సమీకరించి అసలు సిసలు మజా అందించారు డియర్ కామ్రేడ్. చూడాలి మరి, ఫ్యూచర్ లో విజయ్ ప్రొమొతిఒన్స్ ని ఇంకెలా చేస్తాడో. 


మరింత సమాచారం తెలుసుకోండి: